పార్టీ మారినందుకు భార్యకు విడాకులు ఇస్తానంటున్న బీజేపీ ఎంపీ!

మా పదేళ్ల సంబంధాన్ని తెంచుకుంటూ కొంతకాలం తర్వాత తన భార్య సుజాతకు విడాకుల నోటీసు పంపుతున్నానని, ఇకపై తన ఇంటిపేరు ఎక్కడ కూడా ఉపయోగించవద్దని సౌమిత్ర ఖాన్ తెలిపారు.
త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బీజేపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్(Sujata Mondal Khan) ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress)లో జాయిన్ అయ్యారు.
అయితే భార్య పార్టీ మారడం పట్ల ఎంపీ సౌమిత్ర ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. తన భార్య పార్టీ మారి తప్పు చేసిందని, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినందుకు టీఎంసీ సిగ్గుపడాలని అన్నారు.
మా పదేళ్ల సంబంధాన్ని తెంచుకుంటూ కొంతకాలం తర్వాత తన భార్య సుజాతకు విడాకుల నోటీసు పంపుతున్నానని, ఇకపై తన ఇంటిపేరు ఎక్కడ కూడా ఉపయోగించవద్దని సౌమిత్ర ఖాన్ తెలిపారు.
కావాలంటే తన ఆస్తి తను తీసుకోవచ్చని లేకపోతే అది ప్రజలకు దానం చేస్తానని ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. తన కుటుంబాన్ని వీడదీసిన పార్టీని ప్రజలు క్షమించారని, రాష్ట్రం నుండి తరిమివేస్తారని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సౌమిత్రా ఖాన్.
అటు సుజాతా మొండల్ ఖాన్ బీజేపీని వీడుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ సౌగత రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు.
ఓ మహిళగా బీజేపీ పార్టీలో తనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. అయితే తన భర్త ఎంపీ సౌమిత్ర ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతారా? లేదా అన్న ప్రశ్నకు ఆమె భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు.