హైదరాబాద్ లో ఇంటికి రూ.10 వేలు.. వరదసాయం : సీఎం

వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారన్నారు. ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం, సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారన్నారు. ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం, సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఆర్థిక సాయం రేపు(మంగళవారం) ఉదయం నుంచి అందజేయనున్నారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారిక లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
వర్షాలు, వరదలకు సిటీలో రహాదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయల తక్షణం విడుదల చేస్తుందని చెప్పారు.